👉 శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను కన్నుల పండువగా నిర్వహిస్తాం
👉 అమ్మవార్ల ఆశీస్సులు రామగుండం ప్రజలపై ఉండాలి – రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని,అగ్నిధారన్యూస్:ఫిబ్రవరి మాసంలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను కనుల పండుగగా నిర్వహిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం గోలివాడ గోదావరి నది తీరంలో నూతనంగా సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… గోలివాడ గోదావరితీరంలో ఉన్న సమక్క సారలమ్మ గద్దెలు బ్యాక్ వాటర్ రావడంతో మునిగిపోవడం జరిగిందని దీంతో అమ్మవార్ల గద్దెలు నూతనంగా నిర్మాణం చెపట్టడం జరుగుతుందన్నారు. అమ్మవారల జాతర ఫిబ్రవరి 15 వ తేదిన మొదలై 18 ముగుస్తుందని జారతకు కావాల్సిన సదుపాయలతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమ్మవార్లు రామగుండం ప్రజనీకానికి తమ దివేనాలు అందించి అందరిని చల్లగా చూడలన్నారు. శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ జడ్పీటిసి ఆముల నారాయణ వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహెందర్ రెడ్డి ఎంపిటిసిలు జిల్లా కో ఆప్షన్ సభ్యులు, మండల కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, జాతర కమిటి బాధ్యులు తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
