
రహదారి పక్కనే ట్రాన్స్ఫార్మర్.. రక్షణ చర్యలేవీ..?`
అగ్నిధార పత్రిక కథనంపై పెద్దపల్లి జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్ ఇ గంగాధర్ ఆదేశాలతో, డి ఈ రాజ బ్రహ్మచారి, ఏడిఈ మల్లేశం క్షేత్రస్థాయిలో సందర్శన.
విడతలవారీగా ట్రాన్స్ఫార్మర్లకు భద్రత చర్యలు చేపడతాము.
ప్రజలు సమస్యలను నేరుగా తెలుపవచ్చు.
1912 టోల్ ఫ్రీ నెంబర్ కి 24×7 కాల్ చేయొచ్చు.
అగ్నిధార పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలోనీ రెండు డివిజన్లు, ఏడు సబ్ డివిజన్లు, 27 సెక్షన్ల, పరిధిలోని ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు రహదారి పక్కన పంట పొలాలలో ఇతర జన సమూహాలలో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై సెప్టెంబర్ 3 `అగ్నిధార` దినపత్రికలో ప్రచురితమైన.. `రహదారి పక్కనే ట్రాన్స్ఫార్మర్.. రక్షణ చర్యలేవీ..?` అనే కథనానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు నాలుగు రోజుల లోపు వెంటనే స్పందించారు.పెద్దపల్లి విద్యుత్ శాఖ ఎస్ ఈ వి. గంగాధర్ ఆదేశాల మేరకు, సోమవారం పెద్దపల్లి డి ఈ రాజ బ్రహ్మచారి, ఏడిఈ మల్లేశం పత్రిక కథనంలో పేర్కొన్న లొకేషన్ల తోపాటు మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లను, క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. , రహదారి పక్కన పంట పొలాల పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ల , పరిస్థితులను ప్రజలకు ఉన్న ప్రమాదాన్ని అంచనా వేశారు.
అనంతరం డి ఈ రాజ బ్రహ్మచారి అగ్నిధారతో మాట్లాడుతూ.. “అగ్నిధార పత్రికలో వచ్చిన కథనానికి పెద్దపల్లి విద్యుత్ శాఖ ఎస్ ఈ గంగాధర్ ఆదేశాల మేరకు సోమవారం స్వయంగా క్షేత్రస్థాయి సందర్శన చేశామన్నారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు దశలవారీగా చేపడతామన్నారు. మొదట ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం” అని తెలిపారు.అలాగే ప్రజలు విద్యుత్ సమస్యలు ఎదుర్కొన్నట్లయితే లైన్మెన్, ఏఈ దృష్టికి కానీ తమ దృష్టికి తీసుకురావచ్చని, తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని ప్రజలకు సూచించారు.ప్రజా ప్రయోజనాల కోసం సమస్యను వెలుగులోకి తెచ్చిన అగ్నిధార పత్రిక యాజమాన్యానికి, కథనానికి సత్వరమే స్పందించిన ఎస్ ఈ వి. గంగాధర్, డి ఈ రాజ బ్రహ్మచారి ఏ డి ఈ మల్లేశం లకు ఈ సందర్భంగా రైతులు విద్యాసాగర్ రెడ్డి, మల్లయ్య, నరసయ్య రాము, కృతజ్ఞతలు తెలిపారు.
