అగ్నిధారన్యూస్ ( రామగుండం ):మంగళవారం రోజు గోదావరిఖని ఆర్ జి వన్ సింగరేణి ఏరియా హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికులు ను విధుల నుండి తప్పించడం తో కార్మికులంతా ఒక తాటిపైకి వచ్చి విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల  నుండి హాస్పటల్లో సేవలందించిన మా కార్మికులని టెండర్ అయిపోయింది అని చెప్పి విధుల నుండి తొలగించడం బాధాకరం అన్నారు. సింగరేణి యాజమాన్యానికి కరోన సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సింగరేణి కార్మికుల కుటుంబాలకు అధికారులకు సేవలందించిన వారిని ఇప్పుడు ఎలా  తొలగిస్తారని  సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు .టెండర్ నీ యధావిధిగా కొనసాగించక పోతే అన్ని ఏరియా హాస్పిటల్ కార్మికులతో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈనెల 27 తేదీ రోజు చలో కొత్తగూడెం కార్యక్రమాన్ని తలపెట్టని  కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు మహా ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు. అన్ని ఏరియా హాస్పిటల్ కార్మికులు   స్టాఫ్ నర్సులు వార్డు బాయ్స్ ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్రే టెక్నీషియన్ ఆయాలు తరలిరావాలని సంఘం నాయకులు మద్దెల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎరుకల నాగరాజు హాస్పటల్ సిబ్బంది సంపత్ కనకరాజు సాయి విజయ్ మహేష్ మహేందర్ సూర్యనారాయణ వివేక్ కుమారస్వామి చందు అరుణ స్వరూపరాణి విజయలక్ష్మి శారద మీనా శ్యామల సింధు ప్రియా స్నేహ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు