అగ్నిధారన్యూస్ బోథ్ // ఇచ్చోడ:- దిలాబాద్ జిల్లా ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పెద్దపల్లి చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇచ్చోడా సిఐగా విధులు నిర్వహించిన నైలు బైంసా కు బదిలీఅవ్వగా, బైంసా లో  సి ఐ గా పనిచేసిన చంద్రశేఖర్ ఇచ్చోడకు సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చేవారు మధ్య దళారులను నమ్మవద్దన్నారు. సమస్య ఉన్నప్పుడు నేరుగా  వచ్చి ఫిర్యాదు చేయాలని,  ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.గతంలో బజార్ హత్నూర్ మండలంలోని ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విధులు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన సిఐనీ సర్కిల్ పరిధిలో ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిశారు.