మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ.

నేరాలు అదుపుకు  ప్రత్యేక చర్యలు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు.

పోలీస్ నిఘా పెంచాలి.

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి.

 రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాసులు, 

అగ్నిధారన్యూస్ మంథని// రామగిరి

ఆదివారం రోజు రామగుండం సిపి శ్రీనివాసులు జిల్లాలోని మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ , మంథని సీఐ  వెంకటేశ్వర్లు సి పి కి మొక్కను అందించి ఆహ్వాన పలికారు. అనంతరం, పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, ప్రాజెక్ట్ లు, ముఖ్య మైన ప్రదేశాలు, గ్రామపంచాయతిలు, హమ్లెట్ గ్రామాలు, ఆయా పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని, ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే, విషయాలను అడిగి తెలుసుకున్నారు.వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను చర్చించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవరిస్తూ, కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చెయ్యాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ లను  తనిఖీ చేయడం జరిగిందన్నారు. మంథని, రామగిరి పోలీసులు నేరాలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల  సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని  కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు  ఎన్నికల సమయంలో సమస్యలును సృష్టించిన వారి పై పూర్తి నిఘా పెట్టి వారినీ, బాడిలీ ఆఫెండర్స్ ను, రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని  బైండోవర్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో కమ్యూనికేషన్ అనేది చాల ముఖ్యం. పోల్టికల్ వైలెన్స్, దాడులు, లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియో లు వైరల్ చేసే విషయాలు, సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టిసారించాలని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని   ఎవరు గొడవలకు తావు లేకుండా స్వచ్ఛందంగా తమకు నచ్చిన విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో  ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా పాల్పడే చట్ట వ్యతిరేకమైన చర్యలు చేపట్టే వారిపై,   ప్రత్యేకంగా నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని పిడి యాక్ట్ అమలు చేస్తామని  హెచ్చరించారు.  చట్ట విరుద్ధమైన చర్యలు చేపట్టిన, సహకరించిన, సహించేది లేదని హెచ్చరించారు. అక్రమ దందాలు అరికట్టేందుకు స్థానిక పోలీస్, టాస్క్ ఫోర్క్ సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయని, చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసే వారిపై కేసులు  చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమం లో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంథని సీఐ వెంకటేశ్వర్లు, మంథని ఎస్ఐ వెంకట కృష్ణ, రామగిరి ఎస్ఐ సందీప్ లు ఉన్నారు.