అగ్నిధార న్యూస్ పెద్దపల్లి క్రైమ్
పెద్దపల్లి మండలం సబితం గ్రామానికి చెందిన నరసయ్య అనే వ్యక్తి గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా లారీ ఒకసారిగా ఢీకొట్టడంతో టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



