ఆలస్యంగా ప్రారంభమైన సభ అసౌకర్యంగా ఫీలయిన  ప్రజలు.

కనిపించని సీనియర్లు.

హిందీలో ప్రసంగం ఇబ్బంది పడ్డ ప్రజలు.

ప్రసంగం మధ్యలోనే ఖాళీ అయిన కుర్చీలు.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:గురువారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాలలో మైదానంలో నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల సభకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే పరిధిలోని బి.ఎస్.పి ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రజలను సభకు తరలించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. 11గంటలకు జరగాల్సిన సభ ఆలస్యంగా ప్రారంభం కావడం చేత అక్కడికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు కొంత అసౌకర్యానికి గురయ్యారు.. సభా ప్రాంగణానికి బి ఎస్ పి జాతీయ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి చేరుకున్నానంతరం.. తెలంగాణ ఆపార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగించారు.. అనంతరం మాయావతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అంబేద్కర్,బి పి మండల్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలన్నారు. మాయావతి ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలు, కార్యకర్తలు అసౌకర్యంగా ఫీల్ అయినట్టు కనిపించారు. తన ప్రసంగం మొత్తం హిందీలో ఉండడం చేత గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన ప్రజానీకానికి అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఏ బహిరంగ సభలోనైనా జాతీయస్థాయి నాయకులు వచ్చి ప్రసంగిస్తున్న సమయంలో స్థానికంగా ఉండే నాయకులు వచ్చిన ముఖ్య అతిథి మాట్లాడే విషయాలను తెలుగులోకి అనువాదిస్తారు. కానీ పెద్దపల్లిలో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ బహిరంగ సభలో అనువాదకులు లేకపోవడం వల్ల అసౌకర్యానికి కారణమైంది. అనంతరం పెద్దపల్లి బి.ఎస్.పి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష మాట్లాడుతున్న సమయంలోనే… సభకు వచ్చిన ప్రజలు తిరుగు ముఖం పట్టడంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. కనిపించని క్యాడర్… బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు పార్టీ అభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడి పార్టీ క్యాడర్ ని నిర్మించే వాళ్ళని విస్మరించి తగిన ప్రాధాన్యత ఇవ్వక స్టేజి పైకి ఆహ్వానం లేకపోవడం చేత కలత చెందినట్టు తెలిసింది.పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని చర్చ జరుగుతుంది. నిన్న మొన్న పార్టీలో జాయిన్ అయినా వాళ్లకున్న ప్రాధాన్యత సీనియర్లైన నాయకులకు లేకపోవడం వల్ల అలకపూనీనట్లు తెలిసింది.