పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణం శుక్రవారం రోజున పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేదిత పొగాకు ఉత్పత్తులను కలిగి ఉన్నారు, అనే సమాచారంతో, రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి  ఆదేశాల మేరకు  టాస్క్ ఫోర్స్ సీఐ. ఏం. రాజకుమార్, ఎస్ఐ సిహెచ్ నరసింహ రావు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పక్కా సమాచారంతో  దొంతుల నాగమణి S/o విశ్వనాథ్ 45,వైశ్య, సాగర్ రోడ్, పెద్దపల్లి లో పట్టుకున్నారు. పట్టుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల,  విలువ సుమారు 44,120/- వేలరూపాయలు, ఉంటుందన్నారు. ,నిందితున్ని తదుపరి విచారణ నిమిత్తం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
  ఈ టాస్క్ లో సిబ్బంది చంద్ర శేఖర్, రవి, సునీల్, తదితరులు పాల్గొన్నారు.