అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ) కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో డిఎమ్,ఆర్ కప్ క్రికెట్ మ్యాచ్ని ,టాస్ వేసి ప్రారంభించిన కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటీ సంపత్ యాదవ్, పాల్గొన్న జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి,  స్థానిక సర్పంచ్ బుర్ర మంగ సదానందం,   మంగపేట గ్రామంలో శనివారం రోజు గ్రామీణ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడలతో యువతలో ఐక్యత భావం పెరగడమే కాకుండా, చెడు వ్యసనాలకు గురికాకుండా శారీరక ఆరోగ్యానికి  క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. క్రీడలతో పాటు చదువులలో కూడా రాణించాలని జెడ్ పి టి సి వంగల తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కొట్ట సుజాత, రవీందర్, ఎం పి టి సి కొల్లూరు రాయమల్లు , సర్పంచ్ మంద వెంకన్న, ములుగు రవి,సువర్ణ, బుర్ర మారుతి గౌడ్ ,శ్రీపతి రాజు ,శ్రీను  ,కిరణ్,స్థానిక వార్డు సభ్యులు  ప్రజలు తదితరులు పాల్గొన్నారు.