అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా) శుక్రవారం రోజు సాయంత్రం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ నుండి జెండా, మజీద్ ,అమర్ నగర్, అయ్యప్ప టెంపుల్, మీదగా బస్టాండ్ వరకు రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా పెద్దపల్లి డిసిపి అఖిల్ మహాజన్ పెద్దపల్లి ఏసిపి సారంగపాణి తో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రోజురోజుకీ వాహనాల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వాహనదారుల  రక్షణకై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారన్నారు. అయినప్పటికీ అక్కడక్కడ వాహనదారులు  స్వల్ప, తీవ్ర గాయాలపాలై, అదేవిధంగా ప్రాణాలు విడుస్తున్న సంఘటనలు పెద్దపల్లి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్నాయన్నారు.ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించని వారు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటనలు అనేకం అన్నారు. హెల్మెట్ ధరించినట్లయితే స్వల్ప గాయాలతో , ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందుకనే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి రహదారి భద్రత చర్యలు పాటించినట్లయితే ప్రమాదాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు.   ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో  సి ఐ లు  ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి,ఎస్ఐలు రాజేష్, మహేందర్ యాదవ్ తో పాటు పోలీస్ సిబ్బంది, పలువురు వాహనదారులు కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.