దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్.

అర తులం బంగారం స్వాధీనం.

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి క్రైమ్ ) పెద్ద పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లోని ఉదయనగర్ చెందిన ఫిర్యాదుదారు పెరుక చంద్రయ్య S/ o  రాజయ్య, 50 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ, R/o ఉదయ్‌నగర్, పెద్దపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు, అని నగదు రూ. 28,000/- మరియు 2). 1/2 తులా బంగారం W/rs.25000/- మొత్తం W/R. 53,000/- దొంగిలించబడ్డాయని అని తేదీ 04. 09. 2022 రోజు ఫిర్యాదు చేయగా పెద్దపల్లి ఎస్ఐ రాజేష్  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు . దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకొని అతని వద్ద నుండి . అర తులం బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది అని ఎస్ ఐ రాజేష్  ఒక ప్రకటనలో తెలిపారు.

*నిందితుడి వివరాలు:*

చినుమల్ల జడంగిల్ @ విజయ్ S/o శ్రీనివాస్, 21 సంవత్సరాలు, SC మాదిగ, R/o శివాలయం రోడ్డు, సుల్తానాబాద్, ప్రస్తుతం ఉదయనగర్, పెద్దపల్లి.