■ బైండొవర్ నిబంధనలు ఉల్లంఘించిన డీజే యజమాని పై కేసు నమోదు.
■ వివరాలు వెల్లడించిన పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్.
అగ్నిధారన్యూస్ (రామగుండం పోలీస్ కమిషనరేట్)* బసంత్ నగర్ పరిధిలో పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన డీజే ఆపరేటర్ అయినటువంటి కందుల ప్రశాంత్ ను,తేదీ 3-9-2022 రోజున, వినాయక ఉత్సవాలు నిమజ్జన శోభయాత్రలో డీజే కి అనుమతి లేదని తహసీల్దార్ పాలకుర్తి ఎదుట 2 లక్షల రూపాయలకు బాండ్ ఓవర్ చేయడం జరిగింది.కానీ అతడు నిబంధనలు ఉల్లంఘించి నిన్నటి రోజున చెన్నూరులో డీజే పెట్టడం జరిగింది. దాని తో అతనిపై చెన్నూరు పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ఆధారంగా అతను బాండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు లక్షల రూపాయలు జప్తునకు తహసీల్దార్ పాలకుర్తి కు పంపడం జరుగుతుంది. కావున గణేష్ శోభయాత్రలో నిబంధనలు ఉల్లంఘించి ఎవరు D.J లు పెట్టరాదు. D. J ల వల్ల చిన్నపిల్లలు, గర్భిణులు, హృదయ సంబంధిత వ్యాధిగ్రస్తులు, చదువుకునే పిల్లలు ఇబ్బంది కలుగుతుంది.కావున ఇతరులకు ఇబ్బంది కలగకుండా గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ కి. నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఒక పత్రిక ప్రకటనలు తెలిపారు.
