టూరిస్ట్ బస్సు రోడ్డు ప్రమాదం
బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్
హైదరాబాద్ నుండి రామగుండం వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారుగా 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని సమాచారం. సుల్తానాబాద్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

