అగ్నిదారన్యూస్ (ఎండపల్లి)
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభం పెల్లి గ్రామం నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు గ్రామ అభివృద్దిని కాంక్షిస్తూ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంచందర్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో అధిక సంఖ్యలో యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి వారికి బిఆర్ఎస్ పార్టీ కండవా తో పార్టీలోకి ఆహ్వానించారు.
