విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి

మంత్రి శ్రీధర్ బాబు

అగ్నిధారన్యూస్ మంథని :

కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్ ను,సబ్ కలెక్టర్ తో అకస్మాత్తుగా సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలకు సంబంధించిన పలు మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అలాగే మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాలకు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకవస్తే తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ అందరూ క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని తెలిపారు. వారికి ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరిచి ఉన్నతమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.