ఆశవర్కర్ల కు అండగా ఉంటాం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

అగ్నిధారన్యూస్ ,రామగుండం: ఆశలకు పి.ఆర్.సి పెంచి సి.ఎం.కేసీఆర్‌.. తన గోప్ప మనసును మరోమారు చాటారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆశ వర్కర్లకు పీఆర్సీ పెంపుపట్ల సి.ఎం కేసీఆర్‌ చిత్రపటానికి.శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఎమ్మెల్యే ఆశావర్కర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఆశావర్కర్లను కంటికి రెప్పలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కాపాడుతున్నారని అన్నారు. కరోన వ్యాప్తి సమయంలో ఆశావర్కర్లు కరోనా బాధితులకు అండగా నిలిచారని వారికి ధైర్యం కల్పించి తమ సేవ గుణాన్ని చాటరన్నారు. ఆశవర్కర్లను ఆర్దికంగా అదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీఆర్సీ పెంచి ఆశ వర్కర్ల లో మనోధైర్యం కల్పించారన్నారు రాబోయే రోజుల్లో కూడా ఆశాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోని ఆశలకు తము అండగా నిలుస్తున్నామని, ఆశ వర్కర్ల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తవిస్తమన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ టీఆరెస్ నాయకులు ఆశవర్కర్లు పాల్గొన్నారు.