చనిపోయిన సోదరితో నాలుగు రోజులు సహజీవనం అగ్నిధారన్యూస్ క్రైమ్ (పెద్దపల్లి )వింటేనే ఒళ్ళు గగుర్లు పొడిచే నిజం సాధారణంగా చనిపోయిన వ్యక్తిని చూడాలంటేనే తెలియని భయం అలాంటిది చనిపోయిన మృతదేహం తో ఏకంగా వణుకు బెణుకు లేకుండా నాలుగు రోజులు పాటు సహా జీవనం సాగించిన భయానక సంఘటన సభ్య సమాజానికి ఆందోళన కలిగిస్తుంది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రగతినగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పెద్దపల్లి పోలీసులు సీఐ ప్రదీప్ కుమార్ ఎస్ ఐ రాజేష్ లు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి. పట్టణ కేంద్రంలోని ప్రగతినగర్ లొఅద్దె ఇంట్లో అక్క చెల్లెలు మారోజు శ్వేత మారోజు స్వాతి గత కొద్ది కాలంగా జీవిస్తున్నారు . ఈ క్రమంలో మారోజు శ్వేత(24) గత కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చూయించు దామన్న డబ్బులు లేని కారణంగా తీవ్ర అనారోగ్యం పాలై నాలుగు రోజుల క్రితం మృతి చెందింది అన్నారు. స్వాతి సోదరి మృతిచెందిన విషయం బయటకు చెప్పకుండా నాలుగు రోజులుగా అదే ఇంట్లో జీవనం సాగిస్తోంది అన్నారు. కారణం స్వాతి చెప్పిన వివరాల ప్రకారం వీరికి వెనక ముందు బంధువులు ఎవరూ లేకపోవడం ఇరుగుపొరుగు వారికి చనిపోయిన విషయం తెలుపకపోవటం చేత సోమవారం ఇంట్లో నుంచి తీవ్రమైన దుర్గంధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ ఎస్ ఐ రాజ వర్ధన్ సోమవారం సాయంత్రం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.మృతురాలి సోదరి స్వాతి చెప్పినటువంటి విషయాల పైనే కాకుండా విభిన్న కోణాలలో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
