అగ్నిధార న్యూస్ (భీమారం)
మంచిర్యాల జిల్లా భీమారం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు భీమారం మండలం వీఆర్ఏలు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు.30-6-2022 రోజున తెలంగాణ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల తహసిల్దార్ కార్యాలయాల ముందు ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ తేది:24-2-2017 రోజున ప్రగతి భవన్ వేదికగా, తేదీ:7-9-2020 రోజున అసెంబ్లీ సాక్షిగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మరియు మార్చి 2022 లో మరొకసారి వీఆర్ఏ లందరికీ పే స్కేల్ కల్పిస్తామని, హామీ ఇచ్చారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భీమారం మండలం వీఆర్ఏలు పాల్గొన్నారు.