అగ్నిధార న్యూస్( ధర్మారం )

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బోగస్ జాబ్ కార్డులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎ.పి. ఓ. రవి తెలిపారు. ఇందుకోసం అన్ని జాబ్ కార్డు లను ఆధార్ నెంబర్ తో అనుసందానం తప్పనిసరిగా చేయాలని నిర్ణయించారు.  జాబ్ కార్డుల కు ఇంతకు ముందు నుండే ఆధార్ సీడింగ్ జరుగుతున్నప్పటికీ గతంలో దీనిని తప్పనిసరి చేయలేదు. అయితే ఇతర రాష్ట్రాలలో బోగస్ కార్డుల పేరిట పెమెంట్స్ జరుగుతున్నట్టు గుర్తించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ….ఈ తరహా మోసాలను అరికట్టేందుకు ఆధార్ సీడింగ్ ను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ధర్మారం మండలంలో ఉపాధి జాబ్ కార్డులు దాదాపు గా 13000 ఉన్నట్లు తెలిపారు. ఆధార్ సీడింగ్ చేసిన జాబ్ కార్డు హోల్దర్లకే జనవరి 1నుండి కూలీ డబ్బులు అకౌంట్ లో జమ కానున్నాయి. సీడింగ్ కాకపోతే పనికి వెళ్లిన కూడా డబ్బులు జమ కావు. దీంతో ఈ నెల 31 లోపు ఆధార్ సీడింగ్ చేసేందుకు ఉపాధి హామీ సిబ్బంది  ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారన్నారు.