అగ్నిధార కథనానికి స్పందన

ప్రమాదకరంగా గుంతలు..! పట్టించుకోని అధికారులు…!! కథనం

అగ్నిధార న్యూస్ మంథని ఎఫెక్ట్ :

జనవరి నెల 13 వ తేదీన అగ్నిధార న్యూస్ పత్రికలో మానేరు బ్రిడ్జి పై వచ్చిన కథనానికి ఎట్టకేలకు అధికారులలో కదిలిక వచ్చింది..  అగ్నిధార పత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ మరుసటిరోజే ఆర్ అండ్ బి ఈ ఈ.. మానేరు బ్రిడ్జికి కొత్తది నిర్మిస్తామన్నారు, టెండర్లు పిలిచామన్నారు….

సోమవారం రోజు ప్రమాదకరంగా ఉన్న గుంతల వద్ద  సూచికలను బిగించి ఈ రెండు రోజులలో పనులు జరుగుతాయని  తెలిపారు. ఈ మానెరు సోమన పల్లి బ్రిడ్జి పై గుంతలు లేకుండా త్వరగా పనులు చేయాలని ఈ బ్రిడ్జి పై ప్రయాణించే వాహనదారులు కోరుకుంటున్నారు.