అగ్నిధార కథనానికి స్పందన
ప్రమాదకరంగా గుంతలు..! పట్టించుకోని అధికారులు…!! కథనం
అగ్నిధార న్యూస్ మంథని ఎఫెక్ట్ :
జనవరి నెల 13 వ తేదీన అగ్నిధార న్యూస్ పత్రికలో మానేరు బ్రిడ్జి పై వచ్చిన కథనానికి ఎట్టకేలకు అధికారులలో కదిలిక వచ్చింది.. అగ్నిధార పత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ మరుసటిరోజే ఆర్ అండ్ బి ఈ ఈ.. మానేరు బ్రిడ్జికి కొత్తది నిర్మిస్తామన్నారు, టెండర్లు పిలిచామన్నారు….
సోమవారం రోజు ప్రమాదకరంగా ఉన్న గుంతల వద్ద సూచికలను బిగించి ఈ రెండు రోజులలో పనులు జరుగుతాయని తెలిపారు. ఈ మానెరు సోమన పల్లి బ్రిడ్జి పై గుంతలు లేకుండా త్వరగా పనులు చేయాలని ఈ బ్రిడ్జి పై ప్రయాణించే వాహనదారులు కోరుకుంటున్నారు.

